డీజే సౌండ్, ర్యాలీలు నిషేధం
VKB: కోట్పల్లి మండలంలో ఎన్నికల ఫలితాల అనంతరం విజయోత్సవ ర్యాలీలు, బైక్ శోభాయాత్రలు పూర్తిగా నిషేధమని మండల ఎస్సై శైలజ స్పష్టం చేశారు. మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ కొనసాగుతున్నందున గెలిచిన అభ్యర్థులు లేదా వారి అనుచరులు భారీ సభలు, డీజేలు, బైక్ ర్యాలీలు వంటి వేడుకలు నిర్వహించరాదని ఆమె హెచ్చరించారు. ఈ చర్యలు ఉల్లంఘించిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని చెప్పారు.