CMRF చెక్కులను పంపిణీ చేసిన ఎమ్మెల్యే

CMRF చెక్కులను పంపిణీ చేసిన ఎమ్మెల్యే

కృష్ణా: కూటమి ప్రభుత్వం పేదల వైద్యానికి మొదటి ప్రాధాన్యత ఇస్తోందని ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ అన్నారు. ఆదివారం అవనిగడ్డలోని ఎమ్మెల్యే కార్యాలయంలో ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కుల పంపిణీ కార్యక్రమం జరిగింది. ఎమ్మెల్యే బుద్ధప్రసాద్ 67 మంది లబ్ధిదారులకు రూ.53,24,683 సహాయాన్ని చెక్కుల రూపంలో అందచేశారు. ఈ కార్యక్రమంలో మండలి వెంకట్రామ్ పాల్గొన్నారు.