స్మార్ట్ క్లాస్రూమ్లను ప్రారంభించిన సినీనటి
PLD: అమరావతి మండలం ధరణికోటలోని ఎంపీపీఎస్ పాఠశాలలో బుధవారం సినీ నటి మంచు లక్ష్మీ, ధరణి, ఎమ్మెల్యే భాష్యం ప్రవీణ్ కలిసి స్మార్ట్ క్లాస్రూమ్లను ప్రారంభించారు. మంచు లక్ష్మీ ఆధ్వర్యంలో అమరావతి మండలంలోని 10 ప్రభుత్వ పాఠశాలల్లో పేద విద్యార్థుల కోసం స్మార్ట్ క్లాస్రూమ్లను ఏర్పాటు చేయడం పేద పిల్లల భవిష్యత్తుకు బాటలు వేస్తుందని ఎమ్మెల్యే ప్రవీణ్ అన్నారు.