బస్సు కిందపడి గాయపడ్డ వృద్ధురాలు మృతి

బస్సు కిందపడి గాయపడ్డ వృద్ధురాలు మృతి

CTR: పలమనేరు ఆర్టీసీ బస్టాండ్‌లో గంటావూరుకు చెందిన రహమత్ బేగం ప్రమాదవశాత్తు ఆదివారం బస్సు కిందపడి తీవ్రంగా గాయపడిన సంగతి తెలిసిందే. గాయపడిన వృద్ధురాలికి పలమనేరు ఏరియా ఆస్పత్రిలో చికిత్స అందించిన అనంతరం తిరుపతి రుయా ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ.. సోమవారం ఆమె మృతిచెందినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.