భర్తను సుత్తితో కొట్టి చంపిన భార్య

భర్తను సుత్తితో కొట్టి చంపిన భార్య

యాదాద్రి జిల్లా గుండాల మండల కేంద్రానికి చెందిన మాదరబోయిన బిక్షం(64) భార్య ఉపేంద్ర గత కొంతకాలంగా జీవిస్తున్న దంపతులు మధ్య పదేపదే గొడవలు జరుగుతున్నాయి. ఎన్నిసార్లు సర్ది చెప్పినా వినకుండా తాగి రావడంతో విసిగిపోయిన భార్య అర్ధరాత్రి ఇంట్లో నిద్రిస్తున్న బిక్షంని సుత్తితో బలంగా తలపైన కొట్టి చంపింది. ఈఘటనతో గుండాలలో విషాదఛాయలు అలుముకున్నాయి.