బహ్రెయిన్ నుంచి తెలుగు ప్రజల తరలింపు
బహ్రెయిన్లో చిక్కుకున్న తెలుగు ప్రజల తరలింపు ప్రక్రియ ప్రారంభమైంది. అక్కడున్న 600 మందిని స్వదేశానికి తీసుకొచ్చేందుకు అధికారులు ఏర్పాట్లు చేశారు. ఇవాళ్టి నుంచి రోజూ ఒక విమానంలో భారత్కు చేరుకునేలా గల్ఫ్ ఎయిర్ సంస్థతో ఏపీ భవన్ అధికారులు సంప్రదింపులు జరిపారు. ఈరోజు 58 మందిని కొచ్చి విమానాశ్రయానికి తీసుకురానున్నారు.