'రేపు బత్తలపల్లిలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక'

సత్యసాయి: బత్తలపల్లి ఎంపీడీవో కార్యాలయంలో సోమవారం ఉదయం 10 గంటలకు ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక నిర్వహించనున్నట్లు MRO స్వర్ణలత ఆదివారం తెలిపారు. ఆమె మాట్లాడుతూ.. మండలంలోని అన్ని శాఖల అధికారులు హాజరై ప్రజల నుంచి వినతులు స్వీకరిస్తారన్నారు. మండల ప్రజలు ఏవైనా సమస్యలు ఉంటే వినతి పత్రాల రూపంలో ఇవ్వాలని కోరారు.