VIDEO: స్వర్ణభారతి నగర్లో కార్డన్ సెర్చ్ నిర్వహణ
గుంటూరు స్వర్ణభారతి నగర్లో పోలీసులు కార్డన్ సెర్చ్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్పీ వకుల్ జిందాల్, ఈగల్ ఐజీ ఆకే రవి కృష్ణ మాట్లాడుతూ.. డ్రగ్స్కు అలవాటు పడితే జీవితాలు నాశనం అవుతాయని యువతను హెచ్చరించారు. రాష్ట్రవ్యాప్తంగా గంజాయి సరఫరా అయ్యే 849 హాట్ స్పాట్లను గుర్తించామని, అసాంఘిక కార్యకలాపాలను అరికట్టేందుకు తనిఖీలు నిరంతరం కొనసాగిస్తామన్నారు.