నేడు విద్యుత్ సరఫరాలో అంతరాయం

నేడు విద్యుత్ సరఫరాలో అంతరాయం

GNTR: దుగ్గిరాల మండలం చిలువురూలోని 33/11 KV సబ్ స్టేషన్ పరిధిలో విద్యుత్ సరఫరా నిలిపివేయనున్నట్లు ఏఈ గోపి తెలిపారు. మంచికలపూడి ఫీడర్‌లో కొత్తలైన్ ఏర్పాటు నిమిత్తం కెఆర్ కొండూరు, మంచికలపూడి గ్రామాల్లో శనివారం ఉదయం 9.30 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు విద్యుత్ సప్లై నిలిపివేయనున్నట్లు చెప్పారు. ఆయా గ్రామాల ప్రజలు, రైతులు సహకరించాలని ఏఈ కోరారు.