పెళ్లయిన నెల రోజులకే నవ వరుడు ఆత్మహత్య
అనంతపురం జిల్లా నగరూరు గ్రామానికి చెందిన శరత్ కుమార్(23) పెళ్లయిన నెల రోజులకే ఆత్మహత్య చేసుకున్నాడు. స్నేహితుడితో కలిసి బెంగళూరులో సూపర్ మార్కెట్ నిర్వహిస్తున్న శరత్కు గత నెల 2న వివాహమైంది. అతడి భార్య 4 రోజుల క్రితం పుట్టింటికి వెళ్లింది. నంద్యాలలోని స్నేహితుడి గదికి శుక్రవారం వెళ్లిన యువకుడు, భార్యతో పోన్లో మాట్లాడి, పురుగు మందు తాగి చనిపోయాడు.