మరోసారి భారత్పై ఆమిర్ విమర్శలు
భారత్ T20 WC సెమీస్కు వెళ్లడంతో పాక్ మాజీ ప్లేయర్ మహ్మద్ ఆమిర్ను ట్రోల్ ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో అతను మళ్లీ భారత్ ఆటపై విమర్శలు గుప్పించాడు. భారత్ మంచిగా ఆడట్లేదని, నిన్నటి డూ ఆర్ డై మ్యాచులోనూ 3 క్యాచులు వదిలేసిందని విశ్లేషించాడు. బౌలింగ్లో బుమ్రాపైనే జట్టు ఆధారపడిందని పేర్కొన్నాడు. కాగా ఈ టోర్నీలో భారత్ ఏకంగా 13 క్యాచులు చేజార్చింది.