ఆలయంలో సెంట్రల్ లైటింగ్స్ ప్రారంభించిన ప్రభుత్వ విప్

ఆలయంలో సెంట్రల్ లైటింగ్స్ ప్రారంభించిన ప్రభుత్వ విప్

PDPL: ఓదెలలోని శ్రీ మల్లికార్జున స్వామి దేవాలయం ఆవరణలో ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే చింతకుంట విజయరమణరావు రూ.15 లక్షలతో ఏర్పాటు చేసిన సెంట్రల్ లైటింగ్స్‌ను గురువారం సాయంత్రం ప్రారంభించారు. అర్చకులు పూర్ణకుంభంతో స్వాగతం పలికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆలయ కమిటీ సభ్యులు ఆయనను ఘనంగా సత్కరించారు.