కుప్పం RTC బస్టాండ్ను పరిశీలించిన మునిరత్నం
CTR: కుప్పం RTC బస్టాండును ఆదివారం RTC వైస్ ఛైర్మన్ మునిరత్నం పరిశీలించారు. బస్టాండ్లో ఉన్న ప్రయాణికులను ఆర్టీసీ పనితీరు ఏవిధంగా ఉందని ఆరా తీశారు. బస్టాండ్ ప్రాంగణంలో ప్రయాణికులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా పూర్తి స్థాయిలో వసతులు కల్పించాలని, స్వచ్ఛమైన మంచినీటిని అందివ్వాలని అధికారులకు సూచించారు. బస్టాండ్ ప్రాంతంలో పారిశుద్ధ్య పనులు చేపట్టాలన్నారు.