బైక్ను ఢీ కొట్టిన లారీ యువకుడు మృతి
HNK: ఐనవోలు మండలం పున్నేలు క్రాస్ రోడ్డు వద్ద బైక్ను వెనక నుంచి వచ్చిన లారీ ఢీ కొట్టడంతో యువకుడు అక్కడికక్కడే మృతి చెందిన సంఘటన బుధవారం రాత్రి చోటుచేసుకుంది. మృతుడు వర్ధన్నపేట పట్టణానికి చెందిన గొల్లంపల్లి అరుణ్ (26) గుర్తించారు మృతుడు వరంగల్లో ల్యాబ్లో టెక్నీషియన్గా పనిచేస్తున్నాడు. పని ముగించుకుని ఇంటికి వస్తున్న క్రమంలో ఈ ప్రమాదం చోటుచేసుకుంది.