'పదోన్నతుల ఆరోపణలు నిరాధారం'
విశాఖలో హెడ్ నర్సుల పదోన్నతులపై వచ్చిన ఆరోపణలను ప్రభుత్వ నర్సుల సంఘం ఖండించింది. గంగా భవానీ, జీవీఎస్ వరలక్ష్మి నేతృత్వంలో 39 మంది విచారణకు హాజరై పూర్తి వివరాలు సమర్పించారు. ఫిర్యాదుదారులు హాజరుకాకపోవడంతో ఆరోపణలకు ఎలాంటి ఆధారాలు లేవని స్పష్టం చేశారు. పదోన్నతుల విషయంలో ఎలాంటి నగదు లావాదేవీలు జరగలేదని తెలిపారు.