మౌలిక వసతుల కల్పనకు విశేష కృషి: మంత్రి
కోనసీమ: కె.గంగవరం మండలం మసకపల్లి, సుందరపల్లి గ్రామాల్లో కోరమండల్ ఇంటర్నేషనల్ లిమిటెడ్ రూ.60 లక్షలు సీఎస్ఆర్ నిధులతో నిర్మించనున్న రక్షిత మంచి నీటి పథకంకు ఆదివారం రాష్ట్ర కార్మికశాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ శంకుస్థాపన చేశారు. ఆయన మాట్లాడుతూ.. మౌలిక వసతులు కల్పనకు విశేష కృషి చేస్తున్నామన్నారు. కూటమి నాయకులు వాసంశెట్టి సత్యం, కోరమండల్ ప్రతినిధులు పాల్గొన్నారు.