శ్రీవారి దర్శనానికి 8 గంటల సమయం

శ్రీవారి దర్శనానికి 8 గంటల సమయం

AP: తిరుమలలో శ్రీవారి భక్తుల రద్దీ కొనసాగుతోంది. టోకెన్లు లేనివారికి సర్వదర్శనానికి 8 గంటల సమయం పడుతుండగా.. 22 కంపార్ట్‌మెంట్లలో భక్తులు వేచిఉన్నారు. నిన్న తిరుమల వేంకటేశ్వరుడిని 75,004 మంది భక్తులు దర్శించుకోగా.. 23,900 మంది తలనీలాలు సమర్పించుకున్నారు. హుండీ ద్వారా రూ.3.98 కోట్ల ఆదాయం వచ్చినట్లు టీటీడీ అధికారులు తెలిపారు.