'ఎన్నికల సిబ్బంది ర్యాండమైజేషన్ పూర్తి'
KNR: జిల్లాలో మూడవ విడత గ్రామ పంచాయతీ ఎన్నికల నిర్వహణకు సంబంధించి ర్యాండమైజేషన్ విధానంలో పోలింగ్ స్టేషన్ల వారీగా ఎన్నికల సిబ్బంది కేటాయింవు పూర్తి చేసినట్లు జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ పమేలా సత్పతి తెలిపారు. సోమవారం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ఈ ప్రక్రియ నిర్వహించారు. అనంతరం ఎన్నికల నిర్వహణ ఏర్పాట్లపై పంచాయతీ అధికారి జగదీశ్వర్తో సమీక్షించారు.