క్యాన్సర్తో పోరాడుతున్న ప్రముఖ నటి
రొమ్ము క్యాన్సర్తో టాలీవుడ్ నటి వాహిని పోరాడుతుంది. ఆమె ఆరోగ్యం క్షీణించడంతో హైదరాబాద్లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతుంది. అయితే వాహిని ట్రీట్మెంట్కు దాదాపు రూ.35 లక్షల వరకు ఖర్చు అవుతుందని డాక్టర్స్ తెలిపినట్లు సమాచారం. దీనిపై నటి కరాటే కళ్యాణి SMలో ఎమోషనల్ పోస్ట్ పెట్టింది. ఆమె చికిత్స కోసం ఆర్థికసాయం చేయాలని కోరింది.