'అధికారులు ప్రోటోకాల్ పాటించడం లేదు'
పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ విషయంలో జిల్లా అధికారులు ప్రోటోకాల్ పాటించడం లేదని కాంగ్రెస్ సీనియర్ నాయకులు గుమ్మడి కుమారస్వామి ఆరోపించారు. గోదావరిఖని ప్రెస్క్లబ్లో మీడియాతో ఆయన మాట్లాడుతూ.. ఈ విషయంలో SC, ST కమిషన్ దృష్టికి తీసుకెళ్తామన్నారు. జరిగే చీరల పంపిణీ కార్యక్రమానికి సైతం MPని ఆహ్వానించకపోవడం సరైన విధానం కాదన్నారు.