బైక్ రేసింగ్ యువకులకు పోలీసుల హెచ్చరిక

బైక్ రేసింగ్ యువకులకు పోలీసుల హెచ్చరిక

సత్యసాయి: జిల్లా ఎస్పీ సతీష్ కుమార్ ఆదేశాలతో సోమందేపల్లి-పెనుగొండ మధ్య బైక్ రేసింగ్ నిర్వహించిన యువకులకు పోలీసులు కౌన్సెలింగ్ ఇచ్చారు. నిందితులను కోర్టులో హాజరుపరిచినట్లు ఎస్సై సుధాకర్ యాదవ్ తెలిపారు. సరదా కోసం చేసే పనులు ప్రాణాల మీదకు తెస్తాయని, ఇలాంటి చర్యలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.