నేడు ప్రసన్నాంజనేయ స్వామి తిరుణాల

గుంటూరు: ఈపూరులోని బోటిమీద ప్రసన్నాంజనేయ స్వామి తిరుణాల శుక్రవారం జరగనుంది. భక్తులు మొక్కులు తీర్చుకునేందుకు ఇబ్బందులు తలెత్తుకుండా ఆలయ కమిటీ సభ్యులు అన్ని ఏర్పాటు చేశారు. ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నందున అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందు జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు ఎస్సై మహమ్మద్ ఫిరోజ్ పేర్కొన్నారు.