పాక్‌కు మద్దతు తెలిపిన యువతికి బెయిల్

పాక్‌కు మద్దతు తెలిపిన యువతికి బెయిల్

పాక్‌కుమద్దతు తెలుపుతూ ఆపరేషన్ సింధూర్‌ను 'హిందూత్వ ఉగ్రవాదం'గా అభివర్ణించిన 19 ఏళ్ల ఖదీజా షేక్‌కు బాంబే హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది. ఆమెపై మహారాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న చర్యలపై ధర్మాసనం మండిపడింది. అదేవిధంగా వీసా గడువు ముగిసినా ఇంకా భారత్‌లో ఉన్నాడంటూ అరెస్ట్ చేసిన యెమెన్‌కు చెందిన మహ్మద్ ఖాసిమ్ ఆల్ షిబాను కూడా విడుదల చేయాలని ఆదేశించింది.