కుక్కల దాడులతో గాయపడుతున్న ప్రజలు

కుక్కల దాడులతో గాయపడుతున్న ప్రజలు

MNCL: జన్నారం మండలంలోని వివిధ గ్రామాలలో కుక్కల దాడులతో ప్రజలు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. జన్నారం మండలంతోపాటు వివిధ గ్రామాలలో ఇటీవల ప్రజలపై కుక్కల దాడులు పెరిగాయి. గడిచిన మూడు నెలల్లో 12 మందిపై దాడి చేసి గాయపరిచాయి. అయితే కుక్కలను నియంత్రించే అధికారం పంచాయతీ అధికారులకు లేకపోవడంతో తలలు పట్టుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది.