తిరుమల సమాచారం
AP: తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. 4 కంపార్ట్మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. శ్రీవారి సర్వదర్శనానికి 4 గంటల సమయం పడుతోంది. నిన్న శ్రీవారిని 64,684 మంది భక్తులు దర్శించుకోగా.. 20,515 మంది భక్తులు తలనీలాలు సమర్పించుకున్నారు. రూ.3.75 కోట్లు హుండీ ఆదాయం వచ్చినట్లు టీటీడీ అధికారులు వెల్లడించారు.