ఘోర రోడ్డు ప్రమాదం.. యువకుడు మృతి

SKLM: కంచిలి మండలం అంపురం జంక్షన్ సమీపంలో శుక్రవారం రాత్రి ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. వేగంగా వెళ్తున్న లారీ వెనుక చక్రాల కింద సైకిల్పై వెళ్తున్న వ్యక్తి అదుపుతప్పి పడ్డాడు. దీంతో యువకుడు అక్కడికక్కడే మృతి చెందాడు. యువకుడు కర్తలి గ్రామానికి చెందిన సంతోష్గా స్థానికులు గుర్తించారు. ఎస్సై ఘటన స్థలానికి చేరుకొని కేసు నమోదు చేశారు.