సరూర్నగర్ పరిధిలో విషాదం.!
RR: లింగోజిగూడ మణిపూర్ కాలనీలో నివసిస్తున్న ఇంటర్ సెకండ్ ఇయర్ విద్యార్థి గౌతమ్ శర్మ(17) ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మ్యాథ్స్ 2A పరీక్ష బాగా రాయలేదని మనస్తాపానికి గురై ఈ దారుణానికి పాల్పడినట్లు సమాచారం. హోలీ సందర్భంగా కుటుంబ సభ్యులు యాదగిరిగుట్టకు వెళ్లగా, ఇంట్లో ఒంటరిగా ఉన్న సమయంలో ఈ ఘటన జరిగింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.