రైతుల వద్దకే విద్యుత్ అధికారులు
SRCL: రైతు పొలం బాట కార్యక్రమంలో భాగంగా రైతుల వద్దకే విద్యుత్ అధికారులు వెళ్లి సమస్యలు పరిష్కరిస్తున్నారని సిరిసిల్ల సూపరిడెంట్ బిక్షపతి అన్నారు. తంగళ్ళపల్లి మండలం పాపయ్యవల్లిలో రైతు పొలం బాట కార్యక్రమాన్ని గురువారం నిర్వహించారు. ఈ సందర్భంగా సూపరిడెంట్ మాట్లాడుతూ.. ట్రాన్స్ఫార్మర్లో సమస్య ఉంటే అప్పటికప్పుడే మరమ్మతులు చేశామన్నారు.