'రైతుల సంక్షేమం కోసం ఎనలేని కృషి చేస్తున్నారు'
KMR: భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ రైతుల సంక్షేమం కోసం ఎనలేని కృషి చేస్తున్నారని నస్రుల్లాబాద్ బీజేపీ అధ్యక్షుడు హన్మండ్లు నేడు ఒక ప్రకటనలో అన్నారు. కోయంబత్తూర్లో జరుగుతున్న దక్షిణ భారత సేంద్రియ వ్యవసాయ సదస్సులో ప్రధాని కిసాన్ సమ్మన్ నిధి యోజన కింద దేశవ్యాప్తంగా వ్యవసాయ రైతులకు రూ. 9 కోట్లకు పైగా నిధులు విడుదల చేశారన్నారు.