అనుమతి లేకుండా ఇళ్లు కడితే చర్యలు : ఎమ్మార్వో
WNP: శ్రీరంగాపూర్ మండలంలో ప్రభుత్వ స్థలాలు, చెరువుల పరివాహక ప్రాంతాల్లో అక్రమంగా నిర్మాణాలు చేపడితే కఠిన చర్యలు తీసుకుంటామని తహసీల్దార్ వరలక్ష్మి హెచ్చరించారు. ఖాళీ ప్లాట్లు, ప్రభుత్వ భూములపై రెవెన్యూ శాఖ ప్రత్యేక దృష్టి సారించిందని తెలిపారు. ఏవైనా నిర్మాణాలు చేపట్టాలంటే కచ్చితంగా ప్రభుత్వ అనుమతులు తీసుకోవాలని ఆమె స్పష్టం చేశారు.