నేటి సీపీఐ ధర్నాకు అనుమతి లేదు: సీఐ
NDL: కొలిమిగుండ్ల రాంకో సిమెంట్ ఎదురుగా శుక్రవారం సీపీఐ చేపట్టనున్న రైతు ధర్నాకు అనుమతి లేదని సీఐ రమేశ్ బాబు తెలిపారు. మండలంలో 30 పోలీస్ యాక్ట్, 144 సెక్షన్ అమలులో ఉన్నాయని ఆయన పేర్కొన్నారు. నిబంధనలు అతిక్రమించి ధర్నా నిర్వహిస్తే చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు. నాయకులు శాంతిభద్రతలకు విఘాతం కలిగించకుండా సహకరించాలని ఆయన కోరారు.