భారత్-పాక్ మ్యాచ్ ఎప్పుడంటే?
2026 టీ20 ప్రపంచ కప్లో భారత్, పాకిస్తాన్లు తలపడనున్నాయి. వచ్చే ఏడాది ఫిబ్రవరి 15న కొలంబో వేదికగా ఈ రెండు జట్ల మధ్య మ్యాచ్ జరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఏ ఫార్మాట్లో అయినా పాకిస్తాన్పై టీమిండియా ఆధిపత్యాన్ని కొనసాగించింది. ఈ టీ20 ప్రపంచ కప్లోనూ భారత జట్టు పాకిస్తాన్పై తమ పట్టు నిలుపుకోవాలని భావిస్తోంది.