నేడు మరో 11 'ఉడాన్ యాత్రి కేఫ్'లు ప్రారంభం
దేశంలోని మరో 11 విమానాశ్రయాల్లో ఈరోజు 'ఉడాన్ యాత్రి కేఫ్'లు ప్రారంభం కానున్నాయి. విమానాశ్రయాల్లో సాధారణ ప్రయాణికులకు కూడా అందుబాటు ధరలో నాణ్యమైన ఆహార పదార్థాలను అందించడమే ఈ పథకం యొక్క లక్ష్యం. కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు రాజ్కోట్లో ఈ సేవలను ప్రారంభించనున్నారు. భవిష్యత్తులో అన్ని విమానాశ్రయాల్లోనూ ఈ ఉడాన్ కెఫేలను ఏర్పాటు చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది.