ఇంటర్ పరీక్షలో 421 మంది విద్యార్థులు గైర్హాజరు

సంగారెడ్డి: జిల్లాలో 54 పరీక్ష కేంద్రాల్లో గురువారం జరిగిన ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం పరీక్షల్లో 96.81% విద్యార్థులు హాజరయ్యారని ఇంటర్మీడియట్ జిల్లా అధికారి గోవింద్ రాం తెలిపారు. 16,290 మంది విద్యార్థులకు గాను 15,869 మంది విద్యార్థులు హాజరయ్యారని, 421 మంది విద్యార్థులు పరీక్షకు గైర్హాజరైనట్లు పేర్కొన్నారు.