పరీక్షలను అత్యంత పారదర్శకంగా నిర్వహించాలి: కలెక్టర్

పరీక్షలను అత్యంత పారదర్శకంగా నిర్వహించాలి: కలెక్టర్

ADB: పదో తరగతి వార్షిక పరీక్షలను అత్యంత పారదర్శకంగా, పకడ్బందీగా నిర్వహించాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు. ఆదిలాబాద్ కలెక్టరేట్ నుంచి అధికారులకు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా పలు సూచనలు జారీ చేశారు. విద్యార్థులు పరీక్షా కేంద్రానికి నిర్ణీత సమయం కంటే ముందే చేరుకునేలా చూసుకోవాలని, నిమిషం ఆలస్యమైనా అనుమతించడం జరగదని స్పష్టం చేశారు.