విద్యుత్ షాక్‌తో వ్యక్తి మృతి

విద్యుత్ షాక్‌తో వ్యక్తి మృతి

KKD: రమణక్కపేట గ్రామ శివారు ప్రాంతంలో బుధవారం ఓ వ్యక్తి విద్యుత్ షాక్‌కు గురై మృతి చెందాడు. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. రొయ్యల ఫ్యాక్టరీలో కూలీగా పనిచేస్తున్న నూకరాజు (31) మరమ్మతులు చేస్తుండగా, జనరేటర్ కరెంటు రివర్స్ రావడంతో ఈ ప్రమాదం జరిగింది. షాక్‌తో ఆయన మృతి చెందినట్లు స్థానికులు తెలిపారు. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.