ఐదో తరగతి బాలిక మృతి కేసులో వీడిన మిస్టరీ
కోనసీమ: రామచంద్రపురంలో ఐదో తరగతి చదువుతున్న బాలిక మృతి కేసును పోలీసులు ఛేదించారు. ఎలక్ట్రీషియన్ శ్రీను అనే వ్యక్తి బాలికను హతమార్చినట్లు నిర్థారించారు. దొంగతనం కోసం ఆమె ఇంటికి వెళ్లిన ఎలక్ట్రీషియన్.. ఆ విషయాన్ని తల్లికి చెబుతుందనే భయంతో రంజితను హత్యచేసి ఆత్మహత్యగా చిత్రీకరించే యత్నం చేశాడు. అయితే, విచారణ చేపట్టిన పోలీసులు శ్రీను హత్య చేసినట్లుగా గుర్తించారు.