రేడియల్ రోడ్ల భూసేకరణపై హైకోర్టు ఆదేశం

రేడియల్ రోడ్ల భూసేకరణపై హైకోర్టు ఆదేశం

రంగారెడ్డి జిల్లా ఆమనగల్ సమీపంలో మీర్‌ఖాన్‌పేట్ వద్ద ORR నుంచి RRR వరకు నిర్మించనున్న రేడియల్ రోడ్ల కోసం భూముల స్వాధీనం అంశం వివాదంగా మారింది. భూమి యజమానులు పరిహారం చెల్లిస్తేనే భూమిని ఖాళీ చేస్తామని స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో దాఖలైన పిటిషన్‌‌పై హైకోర్టు విచారణ జరిపి, అర్హులైన భూస్వాములకు తగిన పరిహారం అందించాలని ఆదేశించింది.