తిరుమలలో తగ్గిన భక్తుల రద్దీ

AP: తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. టోకెన్లు లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి 5 గంటల సమయం పడుతోంది. నిన్న శ్రీవారిని 83,858 మంది భక్తులు దర్శించుకోగా.. 26,034 మంది తలనీలాలు సమర్పించుకున్నారు. కాగా, స్వామివారి హుండీ ఆదాయం రూ.3.93 కోట్లు వచ్చినట్లు టీటీడీ అధికారులు తెలిపారు.