‘మేం ల్యాప్టాప్లు ఇస్తే.. వాళ్లు రివాల్వర్లు ఇస్తున్నారు’
రాష్ట్రీయ జనతా దళ్ (RJD), మహాగఠ్బంధన్పై ప్రధాని మోదీ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. 'బీహార్ యువత చేతికి మేం ల్యాప్టాప్లు ఇవ్వాలని చూస్తే, వాళ్లు (ఆర్జేడీ) రివాల్వర్లు (తుపాకులు) ఇస్తున్నారు' అని మండిపడ్డారు. బీహార్ మళ్లీ 'జంగిల్ రాజ్'లోకి వెళ్లకూడదని, రాష్ట్రాన్ని ముందుకు నడిపించే ప్రభుత్వం కావాలని ప్రజలకు పిలుపునిచ్చారు.