కేతకి సంగమేశ్వర ఆలయంలో స్వామి వారికి పూజలు

కేతకి సంగమేశ్వర ఆలయంలో స్వామి వారికి పూజలు

SRD: జిల్లాలో ప్రసిద్ధి చెందిన శైవ క్షేత్రం ఝరాసంగం మండల కేంద్రంలోని శ్రీ కేతకి ఆలయంలో శనివారం స్వామివారికి స్థిర వాసరే ప్రత్యేక పూజలు నిర్వహించారు. కార్తీక మాసం కృష్ణ పక్షం తదియ పర్వదినం పురస్కరించుకొని ఆలయ అర్చకులు పార్వతి సమేత సంగమేశ్వర స్వామికి పంచామృతాలు పవిత్ర గంగాజలంతో అభిషేకం చేసి మహా మంగళహారతి నైవేద్యం సమర్పించారు.