'ఉపాధ్యాయులు సమయపాలన పాటించాలి'

KMR: ఉపాధ్యాయులు ప్రభుత్వ పాఠశాలకు సమయపాలన పాటించాలని MLA వెంకటరమణారెడ్డి ఉపాధ్యాయులకు సూచించారు. మంగళవారం సాయంత్రం భిక్నూర్ మండలంలోని ఇసాన్నపల్లి గ్రామంలో ప్రాథమికోన్నత పాఠశాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. పాఠశాల తరగతి గదులు, పరిసరాలను పరిశీలించి ఉపాధ్యాయుల విద్యా బోధన గురించి విద్యార్థులతో మాట్లాడారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థులు ఉన్నారు.