20 లక్షల విలువ గల మొబైల్ ఫోన్లు అందజేత

JGL: జిల్లా పరిధిలో పోగొట్టుకున్న, చోరికి గురైన రూ. 20 లక్షల విలువ గల 102 మొబైల్ ఫోన్లను జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ సీఐఈఆర్ యాప్ ద్వారా ట్రేస్ ఔట్ చేసి బాధితులకు శుక్రవారం డీపీవో కార్యాలయంలో అందజేశారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ.. పోయిన, పాడైపోయిన సెల్ ఫోన్ల పట్ల అశ్రద్ధ చేస్తే వ్యక్తిగత, సామాజిక భద్రతకు భంగం కలుగుతుందన్నారు