స్వచ్ఛ విశాఖకు ప్రజల సహకారం అవసరం
VSP: విశాఖను స్వచ్ఛ నగరంగా తీర్చిదిద్దేందుకు ప్రజలంతా సహకరించాలని జిల్లా కలెక్టర్ ఎం.ఎన్. హరేంధిర ప్రసాద్ పిలుపునిచ్చారు. బీచ్ రోడ్డులో నిర్వహించిన జీరో గ్యాప్ శానిటేషన్ ఆంధ్ర కార్యక్రమంలో పాల్గొన్న ఆయన, ప్లాస్టిక్ వినియోగం తగ్గించి, పారిశుధ్యంపై ప్రతి ఒక్కరూ బాధ్యత వహించాలని సూచించారు. నగర పరిశుభ్రతలో అంతా భాగస్వాములవ్వాలన్నారు.