VIDEO: పైప్లైన్ లీకేజీతో నీరు వృధా
AKP: నర్సీపట్నం శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి ఆలయం వద్ద మెయిన్ రోడ్డుపై తాగునీటి పైప్లైన్ లీకై నీరు వృధాగా పోతోంది. ఇవాళ ఉదయం నుంచి ఈ పరిస్థితి నెలకొంది. ఎవరూ పట్టించుకోలేదని పలువురు ఆరోపిస్తున్నారు. ఇప్పటికైనా ఈ పైప్లైన్కు మరమ్మతుల చేపట్టి తాగునీటి వృధాను అరికట్టాలని స్థానికులు, ప్రజలు కోరుతున్నారు.