సెక్యూరిటీ గార్డుకు ఉత్తమ సేవా పురస్కారం

సెక్యూరిటీ గార్డుకు ఉత్తమ సేవా పురస్కారం

అన్నమయ్య: మదనపల్లె జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో సెక్యూరిటీ గార్డుగా పనిచేస్తున్న రామానుజులు విధి నిర్వహణలో ప్రతిభ కనబరిచినందుకు గురువారం ఉత్తమ సేవా అవార్డు అందుకున్నారు. ములకలచెరువు మండలం దేవలచెరువుకు చెందిన ఆయనను నర్సింగ్ హెడ్ మంజుల అభినందించి అవార్డు అందజేశారు. ఈ సందర్భంగా ఆసుపత్రి సిబ్బంది హర్షం వ్యక్తం చేశారు.