నేడు జిల్లాలో మహర్షి కనకదాస జయంతి వేడుకలు
E.G: రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు మహర్షి కనకదాస జయంతి వేడుకలను శనివారం జిల్లా స్థాయిలో నిర్వహిస్తున్నట్లు జిల్లా బీసీ సంక్షేమ అధికారి బి. శశాంక తెలిపారు. రాజమండ్రిలోని కలెక్టరేట్ వద్ద ఉదయం 10.30 గంటలకు కలెక్టర్ కీర్తి చేకూరి ద్వారా మహర్షి కనకదాస చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పిస్తారన్నారు.