అడిషనల్ జ్యుడీషియల్ ఫస్ట్ క్లాస్ మెజిస్ట్రేట్గా సాహితి

RR: షాద్నగర్ అడిషనల్ జ్యుడిషియల్ ఫస్ట్ క్లాస్ మెజిస్ట్రేట్ & అడిషనల్ జూనియర్ సివిల్ జడ్జ్గా మల్యాల సాహితిని హైకోర్టు నియమించింది. హైకోర్టు విడుదల చేసిన ఉత్తర్వుల ప్రకారం బదిలీలు, నూతన ఎంపికలో ఈ నియామకం జరిగింది. ఇంతకుముందు ఇక్కడ అడిషనల్ జ్యుడీషియల్ ఫస్ట్ క్లాస్ మెజిస్ట్రేట్గా పనిచేసిన ధీరజ్ కుమార్ బదిలీపై వెళ్లడంతో మల్యాల సాహితిని నియమించారు.