గట్టు మండలంలో సమగ్ర శిక్షా సిబ్బంది నిరసన

గట్టు మండలంలో సమగ్ర శిక్షా సిబ్బంది నిరసన

GDWL: TSUTF పిలుపు మేరకు గట్టు మండల సమగ్ర శిక్ష ఉద్యోగులు సోమవారం నల్ల రిబ్బన్లు ధరించి నిరసన చేశారు. 2008 డీఎస్సీ కాంట్రాక్ట్ టీచర్లకు 12 నెలల వేతనం, కేజీబీవీ ఉద్యోగుల సమ్మె కాలపు జీతాలను వెంటనే విడుదల చేయమని డిమాండ్ చేశారు. ప్రభుత్వం స్పందించి వారికి న్యాయం చేయాలని, వారి సమస్యలను గమనించాలన్నారు.