రైతులు అప్రమత్తంగా ఉండండి: వాతవరణశాఖ

రైతులు అప్రమత్తంగా ఉండండి: వాతవరణశాఖ

తూర్పు మధ్య అరేబియా సముద్రంలో అల్పపీడనం ఏర్పడినట్లు వాతావరణశాఖ వెల్లడించింది. మరో 36 గంటల్లో ఈ అల్పపీడనం.. వాయుగుండంగా మారే అవకాశం ఉన్నట్లు తెలిపింది. మరో వైపు ఈ నెల 27 నాటికి బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే ఛాన్స్ ఉన్నట్లు పేర్కొంది. తదుపరి 2రోజుల్లో అల్పపీడనం బలపడనున్నట్లు చెప్పింది. దీని ప్రభావంతో ఏపీలో వర్షాలు పడతాయని.. రైతులు అప్రమత్తంగా ఉండాలని సూచించింది.